శ్రీనువైట్ల కెరీర్లో సక్సెస్ అయిన ప్రతీ చిత్రంలో కూడా బ్రహ్మానందం పాత్ర చాలా ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కొన్ని సినిమాల్లో హీరోలను సైతం డామినేట్ చేసేలా బ్రహ్మానందం కామెడీ ఉండేది.
అయితే స్టార్ హీరోలు సక్సెస్ క్రెడిట్ బ్రహ్మానందంకు వెళ్తుందనే ఉద్దేశ్యంతో ఆయన్ను పక్కకు పెట్టాలనుకుంటున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అదే క్రమంలో త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్చరణ్ నటించబోతున్న ‘నా పేరే రాజు’ చిత్రంలో బ్రహ్మానందం కనిపించడు అంటూ వార్తలు వచ్చాయి.
రామ్చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో బ్రహ్మానందం లేడనే వార్తలను ఆ చిత్ర రచయితల్లో ఒక్కడైన గోపీ మోహన్ ఖండిరచాడు.ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని, మంచి కామెడీని బ్రహ్మీ పండిస్తాడని గోపీ మోహన్ చెప్పుకొచ్చాడు.
బ్రహ్మానందం లేకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించాడు.ఈ చిత్రానికి కోన వెంకట్తో కలిసి గోపీమోహన్ కథను అందించడం జరిగింది.
త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతుంది.ఈ చిత్రంలో చరణ్ సరసన ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.