ఏపీ రాజధాని మార్పు విషయంలో జగన్ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది.ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చిన జగన్ ప్రభుత్వం అతి త్వరలో వైజాగ్ నుండి పరిపాలన కొనసాగించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో రాజధాని విషయమై కోర్టులో కేసు నడుస్తోంది.అయినా కూడా వైజాగ్లో రాజధాని శంకుస్థాపన జరుగబోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఆ శంకుస్థాపనకు పీఎం మోడీని కూడా ఆహ్వానించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.ఎవరు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా రాష్ట్ర ప్రజల కోరిక తీరబోతుందని ఆయన అన్నారు.అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా మరవకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఈ సందర్బంగా బొత్స హామీ ఇచ్చారు.చంద్రబాబు స్వప్రయోజనాలే ముఖ్యంగా అమరావతిని రాజధానిగా చేశారని జగన్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని అమరావతిని మాత్రమే కాకుండా వైజాగ్ ను కూడా రాజధానిగా చేయాలని నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నాడు.
ఈ విషయంలో ఎవరికి అన్యాయం జరుగకుండా జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని బొత్స అన్నారు.గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీని మళ్లీ వైజాగ్ రాజధానిగా శంకుస్థాపనకు పిలుస్తామని బొత్స చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.