భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకు వెళ్లే ఆలోచనలో పావులు కదుపుతుంది.ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లో ముఖ్యమైన నేతలకు గాలం వేస్తూ వారికి తమ పార్టీలోకి ఆహ్వానాలు పంపిస్తూ రెడ్ కార్పెట్ పరుస్తుంది.
అయితే ఇప్పటికే కన్నా బీజేపీలోకి చేరిపోగా, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సైతం అదే రేస్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న నేపధ్యంలో దీనిపై బొత్సా స్పందించారు.నిన్న హైదరాబాద్ లో ఆయన మాట్లాడతూ ఇవన్నీ మీడియా కదనాలే తప్ప అందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని, ఇప్పటివరకూ బీజేపీ వారెవరూ తమను సంప్రదించలేదు అని, అంతేకాకుండా ఓడిపోయిన తమని ఎందుకు బీజేపీ అక్కున చేర్చుకుంటుంది అని ఆయన తెలిపారు.
ఎంత కాదు అని అనుకున్న 2019నాటికి బీజేపీ స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అని బలంగా పావులు కదుపుతుంది.మరి అలాంటి సమయంలో ఇలాంటి బలమైన నాయకులే పార్టీకు అండ కదా.