ఏపీలో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ మధ్య మాటల్లో ఉన్నంత సఖ్యత నాయకుల్లో లేదనే విషయం అందరికీ తెలిసిందే! అంతా ఒక్కటిగానే ఉన్నామని చెబుతారు.కానీ తలో మాట మాట్లాడతారు!! తమ మధ్య విభేదాలు లేవని స్పష్టం చేస్తారు.
కానీ ఒకరిపై ఒకరు విమర్శించుకుంటారు!! అయితే కలహాలు ఎలా ఉన్నా వాటిని బయటపడకుండా చేయడంలో ఇద్దరు నాయుళ్లు కీలకంగా చక్రం తిప్పుతున్నారు.దీంతో బీజేపీ-టీడీపీ దాగుడు మూతలు ఆడుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీలో కీలక నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే ఇద్దరూ ఓ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు! అదేంటంటే.
ఇరు పక్షాల మధ్య ఎవరైనా విమర్శలు సంధిస్తే.వెంటనే వీరు తెరవెనుక చక్రం తిప్పుతున్నారట.
రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడం లేదని టీడీపీ నేతలు అంటే.టీడీపీతో తాము మిత్ర పక్షంగాఉన్నప్పటికీ తమను గుర్తించడం లేదని బీజేపీ నేతలు అన్నా.
వెంటనే తెరమీదకి వస్తున్న ఇద్దరు నాయుళ్లు.పరిస్థితులను చక్కదిద్దేస్తున్నారట.
ముఖ్యంగా ప్రత్యేకహోదా ఇస్తామని మాట తప్పిన బీజేపీపై విపక్షాలతో పాటు ఒకరిద్దరు టీడీపీ నేతలు గొంతు కలిపారు.దీంతో వెంటనే బాబుకి వెంకయ్య ఫోన్ చేసి సర్దిచెప్పారట.
దీంతో టీడీపీ సైలెంట్ అయిపోయింది.అలాగే టీడీపీ, అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు గుప్పించే సోము వీర్రాజు వంటి వారిని అదుపులో పెట్టడానికి కూడా బాబు ఇదే పద్ధతి ఫాలో అయ్యారట.
దీంతో అటు నుంచి బీజేపీ నేతల నోటికి తాళం పడేలా ఏవో ఆజ్ఞలు! ఇంకేముంది.ఇరు పక్షాల మధ్య ఇలా దాగుడు మూతల ఆటలు సాగుతున్నాయట.
వీరి ఆటలతో సమస్యలు మరుగున పడుతున్నాయని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు.