భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీయే కేంద్ర బిందువని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.అంటే దేశ రాజకీయాలన్నీ కమలం పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయని అరుణ్ అభిప్రాయం.
ఇక నుంచి దేశ రాజకీయాలు భాజపా అలనుకూల, భాజపా వ్యతిరేక రాజకీయాలుగా ఉంటాయన్నారు.ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటే వేదవాక్కని, కాని యూపీఏ హయాంలో ప్రభుత్వం బయటి నుంచి నడిచిందని అన్నారు.
అంటే మన్మోహన్ సింగ్ పేరుకే ప్రధాని అని, ప్రభుత్వాన్ని పరోక్షంగా నిర్వహించింది సోనియాగాంధీయేనని అరుణ్ నర్మగర్భంగా చెప్పారు.బీహార్ ఎన్నికల్లో భాజపా గెలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అక్కడ ఆరు పార్టీలతో ‘జనతా పరివార్’ ఏర్పాటు కావడం సాధ్యం కాదన్నారు.మోదీ పాలన ఏడాది అయిన సందర్భంగా ప్రతి రోజూ ఆయన పాలనను ప్రశంసిస్తున్న అరుణ్ మరోసారి అ పనే చేశారు.
ఎవరికివారు పొగుడుకోవడంవల్ల ఏమీ ఉపయోగంలేదు.ప్రజలు ప్రశంసించాలి.
భాజపా గత ఎన్నికల్లో భారీ మెజారిటీ తెచ్చుకుంది కాబట్టి సహజంగానే రాజకీయాల్లో కేంద్ర బిందువైంది.వచ్చే ఎన్నికల్లో ఇది ఓడిపోతే గెలిచిన పార్టీ కేంద్ర బిందువు అవుతుంది.
ఈ క్రెడిట్ నిలకడగా ఉండేది కాదు.మార్పు అనివార్యం.