ఎవరు నోరు విప్పాలి? ఏ అంశం మీద నోరు విప్పాలి? నోరు విప్పాల్సిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.ఆయన మాట్లాడాల్సింది జమ్మూ కశ్మీర్లో భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి.
ఈ డిమాండ్ చేసిన నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.పిడిపి-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగిస్తున్న జమ్మూ కశ్మీర్లో ఈమధ్య వేర్పటువాదులు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని హల్చల్ చేశారు.
ఇదంతా బహిరంగంగా జరిగింది.పొద్దునలేస్తే భారత జాతీయత, దేశభక్తి గురించి మాట్లాడే భాజపా భాగస్వామిగా ఉన్న జమ్మూ కశ్మీర్లో ఈ విధంగా జరగడమేమిటని నితీష్ కుమార్ ప్రశ్నంచారు.
అధికార మత్తు తలకెక్కగానే సిద్ధాంతాలు మర్చిపోయారా అని ధ్వజమెత్తారు.మంచుకొండల రాష్ర్టంలో జాతి వ్యతిరేక కార్యకలాపాల గురించి జవాబు చెప్పాల్సిందేనన్నారు.
జనసంఘ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా భాజపా సంకీర్ణంలో చేరిందన్నారు.జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అంత బలంగా లేదనేది నితీష్ అభిప్రాయం.
మోదీ హయాంలో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారని చెప్పడం ఆయన ఉద్దేశం.బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మోదీని అన్పాపులర్ చేయాలని కొత్త పార్టీలో జనతా పరివార్లో భాగస్వామి అయిన నితీష్ ప్రయత్నిస్తున్నారు.