ధిల్లీ : ఈ దేశంలోని ఆడపిల్లకు రక్షణ కలిపించి వారి ఎదుగుదలకు అండగా నిలవాల్సిన భాద్యత యావత్తు భారతీయ సమాజంపై ఎంతైనా ఉంది బాలీవుడ్ బాదుషా అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శనివారం సాయంత్రం దేశ రాజధాని ధిల్లీ లో ఇండియా గేట్ వద్ద భారీ కార్యక్రమం జరుగుతోంది
.ఈ కార్య్రకమంలో పాల్గొన్న అమితాబ్ మీడియాతో ముచ్చటిస్తూ ‘ బేటీ బచావో , బేటీ పడావో స లాంటి అద్భుత కార్య్రకమానికి ప్రచార బాధ్యతలు వహించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రధాని ఇచ్చి న భాద్యతలతో తన వంతుగా పథకం ఫలవంత మయ్యేలా ప్రచారం చేస్తానని అన్నారు
బాలికల సంకర్షణ.ఎంత ముఖ్యమో, వారిని పాఠశాల కు పంపాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు భారతీయ సంస్కృతి, సం్రపదాయాలలో వనితలకుప్రత్యేక స్టానం ఉందని, భారత దేశ చరిత్రలో, ఈ దేశ వికాశంలో వారి మహిళల సేవలు అమోఘమైనదని అన్నారు తన కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలపేందుకు మహిళలు పడే తపనకు విలువ కట్టలేమని చెప్పారు అమితాబ్
కాగా ఒకప్పుడు రాజీవ్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న బచన్ కుటుంబం మారిన పరిస్తుతులతొ భాజపాకు జై కొట్టినా , కీలకంగా ఉన్న సందర్భమే లేదు .ఐతే ఇటీవల ఆఫ్షోర్ సంస్థలతో లింకులు కలిగినటు్ల పనామా పేపర్ లీక్ ల ఆరోపణలు ఆ కుటుంబాన్ని వెల్లువత్తీన విషయం విదితమే
ఈ నేపథ్యంలో బేటీ బచావో , బేటీ పడావో పథక ప్రచార బాధ్యతలు వేరొకరికి అప్పగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోనుందన్న వార్తలను కొట్టిపారేసాలా అమితాబ్ తిరిగి తెరపైకి రావటం గమనార్హం.