టాలీవుడ్ నుండి రానా, రామ్ చరణ్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి నటునిగా మంచి పేరు తెచ్చుకున్నారు.అదే తరహాలో మరో యంగ్ స్టార్ బాలీవుడ్ లో విలన్ గా తెరంగేట్రం చేయనున్నారు.
రక్తకన్నీరు ఫేం నాగభూషణం మనువడు, భూషణ్ విలన్ గా బాలీవుడ్ లో రూపొందించిన ‘రిథమ్’ చిత్రం ద్వారా ఈ నెల 19న ఎంట్రీ ఇవ్వబోతున్నారు.తెలుగులో ఏక్ పోలీస్, పదహారేళ్ళ వయసు, మ్యావ్ వంటి చిత్రాల ద్వారా తెలుగులో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న భూషణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.”ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీ.పోలాండ్ దేశంలో ఈ సినిమా పూర్తి చిత్రీకరణ జరిపాం.
మొదటిసారి నేను హిందీలో ఓ ఫుల్ లెంగ్థ్ నెగటివ్ రోల్ లో నటించబోతున్నాను” అని తెలిపారు.