నందమూరి హీరోలు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్లు సంక్రాంతికి తమ సినిమాలతో సందడి చేయబోతున్న విషయం తెల్సిందే.వీరిద్దరి సినిమాలకు కేవలం వారం పది రోజులు మాత్రమే గ్యాప్ ఉండబోతుంది.
దాంతో వీరిద్దరి మధ్య వార్ తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ రెండు సినిమాలు ఒకే సారి వస్తే ఫ్యాన్స్కు పండగే, అయితే ఓపెనింగ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.
ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు ఒకే సారి విడుదల అవ్వబోతుండటంతో పాటు ఈ రెండు చిత్రాల ఆడియోలు కూడా ఒక్క రోజు గ్యాప్లో విడుదల అవ్వబోతున్నాయి.ముందుగా బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రం ఆడియోను వచ్చే నెల 12న విడుదల చేయాలని నిర్ణయించారు.
అందుకు తగ్గ ఏర్పాట్లు జరగుతున్నాయి.తాజాగా ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియోను వచ్చే నెల 13న విడుదల చేయాలని భావిస్తున్నారు.
రెండు సినిమాలు వారం పది రోజుల గ్యాప్లో అంటే పర్వాలేదు కాని, రెండు ఆడియో వేడుకలు ఒక్క రోజు గ్యాప్లో అంటే ఫ్యాన్స్ ఆడియో వేడుకలకు హాజరు అవ్వడం సమస్యగా ఉంటుందని, అందుకే ఎవరో ఒకరు డేట్ మార్చుకోవాల్సిందిగా నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు.మరి ఎన్టీఆర్, బాలయ్యలలో ఎవరు తగ్గుతారు అనేది చూడాలి.