రవితేజ హీరోగా ‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెంగాల్ టైగర్’.ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
పవన్ కళ్యాణ్తో ఈ టైటిల్ను పెట్టి సినిమా చేయాల్సిన సంపత్ నంది కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకుని రవితేజతో ఈ సినిమా చేశాడు.దాంతో సినీ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
‘రచ్చ’ వంటి మాస్ ఎంటర్టైనర్తో సక్సెస్ను అందుకున్న సంపత్ నంది పేరులోనే మాస్ ఉన్న రవితేజతో మరింత మాస్ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కాని చిత్ర యూనిట్ సభ్యుల తీరును చూస్తుంటే చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
విడుదలకు మరో వారం రోజులు కూడా సమయం లేదు.
అయినా ఇప్పటి వరకు ‘బెంగాల్ టైగర్’ గురించిన పబ్లిసిటీ మొదలు పెట్టింది లేదు.అలాగే విడుదల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా అనిపించడం లేదు.
అందుకే ఈ సినిమా వాయిదా వేశారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇంకా అధికారిక ప్రకటన రాక పోయినా అతి త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులు ఇదే విషయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
వచ్చే నెల రెండవ వారంలో ‘అఖిల్’ విడుదల ఉన్న నేపథ్యంలో పోటీ వద్దనుకుని ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసి ఉంటారు అని అంటున్నారు.‘అఖిల్’ ఫలితాన్ని బట్టి టైగర్ వచ్చే డేట్ ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి.
బెంగాల్ టైగర్ చిత్రంలో రవితేజకు జోడీగా తమన్నా మరియు రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.