నందమూరి బాలకృష్ణ ఆడియో ఫంక్షన్లకి వెళ్ళడం.ఆయన చేసే వాఖ్యలు వివాదాస్పదం అవడం .
ఇదో రొటీన్ విషయం అయిపోయింది.నారా రోహిత్ నటించిన “సావిత్రి” ఆడియో ఫంక్షన్ లో అమ్మాయిలకి ముద్దులు అయినా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ బాలకృష్ణ చేసిన వాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి.
జాతీయ మీడియా “వల్గర్ స్టార్” అంటూ విచిత్రమైన బిరుదు కూడా కట్టబెట్టింది మన నందమూరి హీరోకి.మహిళా సంఘాలు బాలకృష్ణ వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, బాలకృష్ణ అసెంబ్లీలో క్షమాపణ చెప్పడం ఆ తరువాత జరిగిపోయాయి.
ఇక మొన్న నడిగర్ సంఘం ఆధ్వర్యంలో తమిళ స్టార్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ తిలకించడానికి వెళ్ళిన బాలకృష్ణ, పబ్లిక్ లో సిగరెట్ కాల్చి మళ్ళీ విమర్శల పాలయ్యారు.ఒక స్టార్ హీరో అయ్యుండి, హిందూపూర్ ఎమ్మెల్యే అయ్యుండి, పబ్లిక్ గా సిగరెట్ తాగడం ఏంటని తెగ తిట్టేసారు సోషల్ మీడియా ప్రజలు.
తాజాగా మరోసారి నోరుజారి సోషల్ మీడియాలో విమర్శలకు బలవుతున్నారు బాలకృష్ణ.
నిన్న త్రిష నటించిన “నాయకి” చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ జరిగింది.చీఫ్ గెస్ట్ గా వెళ్ళిన బాలకృష్ణ, ఓ పది నిమిషాలపాటు మాట్లాడారు.మైక్ చేతిలో లేనప్పుడు, కెమెరా తనవైపు లేదు అనుకున్నారేమో .స్టేజి మీద ఉన్నవాళ్ళతో ” సిగరెట్ తాగనివ్వరు, అమ్మాయిలని ముద్దుపెడతా, కడుపు చేస్తా అంటే అదీ కాదంటారు ” అంటూ అనడం, అది స్పష్టంగా విడియోలో పడటం జరిగింది.ఇంకేముంది, సామాజిక వెబ్ సైట్స్ లో ఈ విడియో వైరల్ గా వెళుతోంది.
.