బాలకృష్ణ త్వరలో ‘లయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదలైంది.
తాజాగా మే 1న మేడే సందర్బంగా ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత రుద్రపాటి రమణారావు ప్రకటించాడు.సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా త్రిష మరియు రాధిక ఆప్టేలు హీరోయిన్లుగా నటించారు.
మణిశర్మ సంగీతాన్ని అందించాడు.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం లీక్ అయిన కథ… బాలకృష్ణ ఒక సీనియర్ మరియు సిన్సియర్ సీబీఐ ఆఫీసర్.అవినీతిపరుల గుండెల్లో నిద్రపోయే సీబీఐ ఆఫీసర్పై రాజకీయ నాయకులు పగ పెంచుకుంటారు.
తమను ఈయన బతకనివ్వడు అని, ఆఫీసర్నే చంపేయాలని భావిస్తున్నారు.అందుకు హత్య ప్రయత్నం చేస్తారు.
ఆ ప్రమాధం నుండి బాలయ్య బయటపడతాడు.అయితే మతి స్థిమితం కోల్పోతాడు.
తన లక్ష్యం మినహా మొత్తం మర్చి పోతాడు.తన గతం గుర్తు లేకుండానే అవినీతి పరుల అంతం చేస్తాడు అనేది కథగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో కొన్ని యదార్థ సంఘటనలను కూడా జొప్పించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.