నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెల్సిందే.శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి మరియు సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
ఈ సంవత్సరం చివర్లో ‘డిక్టేటర్’ను పూర్తి చేసి, ఇదే సంవత్సరంలో తన 100వ సినిమాను ప్రారంభించాలని బాలకృష్ణ ఆశపడుతున్నాడు.ఇక బాలయ్య 100వ సినిమా తర్వాత మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు.
బాలకృష్ణ కెరీర్లో ఎప్పటికి గుర్తుండి పోయే సినిమా ‘ఆదిత్య 369’.ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు.
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక అద్బుతాన్ని ఆ సినిమాతో దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చూపించారు.భవిష్యత్తు తరాలు ఎలా ఉండబోతున్నాయో చూపించేందుకు ప్రేక్షకులను మరో కాలానికి తీసుకు వెళ్లారు.
మరోసారి సింగీతం శ్రీనివాస్ ఇలాంటి సినిమాను చేయబోతున్నారు, అందులో హీరోగా బాలకృష్ణ నటించనున్నాడు అంటూ రెండు సంవత్సరాల క్రితం వార్తలు వచ్చాయి.అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.
అయితే ఆ ప్రాజెక్ట్పై సింగీతంకు చాలా నమ్మకం ఉంది.అందుకే బాలయ్య తన 101వ సినిమాగా ‘ఆదిత్య 369’కు సీక్వెల్గా ‘ఆదిత్య 999’ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇప్పటికే ఒక స్టోరీ లైన్కు సైతం బాయ్య ఓకే చెప్పాడని అంటున్నారు.వచ్చే సంవత్సరం చివర్లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
మరి ఈ కాంబో మరో సారి వెండి తెరపై అద్బుతాన్ని ఆవిష్కరిస్తారేమో చూడాలి.