మరోరోజు, మరోసారి అదే కోపం, అదే దుడుకు, మరో వివాదం.నందమూరి బాలకృష్ణ ఆవేశం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా వెళుతోంది.
ఓ నెల క్రితం ఫోటోల కోసం వచ్చిన ఫ్యాన్స్ ని బూతు కడిగి వైరల్ గా వెళ్ళిన బాలకృష్ణ, మొన్నటికి మొన్న తన కొత్త సినిమా ప్రారంభం రోజు చెప్పులు తీయనందుకు అసిస్టెంట్ పై చేయి చేసుకొని మరోసారి నేషనల్ మీడియా హెడ్ లైన్స్ లో నిలిచారు.చివరిసారి ఓ ఆడియో ఫంక్షన్ లో ఆడవారికి ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అంటూ కామెంట్స్ చేసి ఇలా నేషనల్ మీడియాలో పెద్ద న్యూస్ అయిపోయారు బాలయ్యబాబు.
ఇక తాజాగా జరిగిన సంఘటన మీద నేషనల్ మీడియా ఎక్కువ ఫోకస్ పెడుతుందో లేదో కాని తెలుగు రాష్ట్రాల చానెల్స్, సోషల్ మీడియాలో మాత్రం రెండు మూడు రోజులు తిరగడం ఖాయం.ఈసారి ఏమైంది అనే కదా మీ ఉత్సుకత.
నంద్యాలలో బై ఎలక్షన్స్ జరగనున్న సంగతి మీరు పత్రికల్లో చదివే ఉంటారు.ఆ బై ఎలక్షన్స్ లో తెదేపా తరఫున ప్రచారం చేయడానికి నంద్యాల వెళ్ళారు బాలకృష్ణ.
ఆయనకీ స్వాగతం పలికేందుకు తెదేపా కార్యకర్తలతో పాటు కొందరు అభిమానులు కూడా వచ్చారు.జై బాలయ్య నినాదాలతో మంచి హంగామా చేసారు.
పెద్ద దండ తీసుకొచ్చి వేయబోయారు.ఇంతలో చిన్నిపాటి తోపులాట జరగనైతే జరిగింది కాని, బాలకృష్ణ మీద మాత్రం ఎవరు పడలేదు.
అంతలోనే ఆగ్రహావేశానికి లోనైనా బాలకృష్ణ ఒక అభిమాని చెంపపై లాగి పెట్టి కొట్టారు.అదే కోపంలో వెళ్ళిపోయారు.
ఈ విడియో ఇలా బయటపడిందో లేదో, అప్పుడే వైరల్ అయిపొయింది.సోషల్ మీడియా మొత్తం అదే కనిపిస్తోంది.
అప్పుడే ఒక నేషనల్ దినపత్రిక ఈ వార్తను తమ వెబ్ సైట్లో పెట్టేసింది.ఇదే విషయాన్ని పత్రికలో ప్రచూరిస్తే దీనికి మరింతగా ప్రచారం దొరుకుతుంది.
ఎంత కాదన్నా, ఇలా మాటిమాటికి జరగడం బాలకృష్ణ ఇమేజ్ కి మంచిది కాదేమో.మంచి పీఆర్ టీంని పెట్టుకొని, ఇలాంటి కార్యక్రామాల్లో అన్ని వాళ్ళే దగ్గరుండి చూసుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి.