నంద్యాల ఉప ఎన్నికలో బుధవారం అత్యంత కీలక సన్నివేశం చోటు చేసుకుంది.చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ.
ప్రచారం ప్రారంభించారు.ఆయన కోసం జనాలు రోడ్ల మీదకి చేరడంతో ఇసకేస్తే రాలనంతగా మారిపోయాయి నంద్యాల రోడ్లు.
ఇక, తన సినీ డైలాగులతో విరుచుకుపడ్డ బాలయ్య ఆద్యంతం జనాల్ని ఆకట్టుకున్నారు.అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని ఓటు తూటాతో కాల్చేయాలన్న బాలయ్య పిలుపుకి జనాలు భారీగా స్పందించారు.
జగన్ అండ్కోని దృష్టిలో పెట్టుకునే బాలయ్య ఈ డైలాగ్ పేల్చడంతో టీడీపీ అభిమానులు సహా.జగన్ వ్యతిరేకుల్లో తీవ్ర స్పందన కనిపించింది.
అదికూడా రెచ్చగొట్టేలా కూడా కాకుండా ఓటు తూటా అనే పదం బాలయ్య వినియోగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అదేవిధంగా .‘మరి నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో, ఆయన అభిమానులంతా ముందుకొచ్చి పార్టీని నడిపించారు.ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపర్చాలి.
’ అంటూ ప్రారంభించిన బాలయ్య ప్రసంగానికి అడుగడుగునా జనాలు చప్పట్లతో హోరెత్తించారు.గతంలో తెలుగువారైన పీవీ నర్సింహారావు నాడు నంద్యాల నుంచి పోటీచేస్తే ఆయన గెలుపు కోసం భూమా కుటుంబం సహకరించిందని, సినిమా షూటింగ్స్ కోసం ఎప్పుడొచ్చినా.
భూమా కుటుంబం ఇల్లు ఇచ్చేవారని, వాళ్ల కూతురు అఖిలప్రియ పర్యాటక మంత్రి కావడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా ‘ఒక్క మగాడు’ సినిమాలో కులాలపై రాసిన డైలాగును బాలయ్య చెప్పగా.
అభిమానులు ఈలలువేసి చప్పట్లతో హోరెత్తించారు.ఇక, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు, బలిజలకు టీడీపీ ప్రభుత్వం ఏమేమి చేస్తున్నదో వివరించాడు బాలయ్య.
అదేసమయంలో ప్రస్తుత ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో వివరిస్తూ.భూమా కుటుంబాన్ని అందరూ ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.
రోడ్డు షోతో ప్రారంభమైన బాలయ్య ప్రచారం.పలు ప్రధాన కూడల్లో నిలుస్తూ…… ప్రచారం చేస్తున్నారు.
ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నవారికి తగిన బుద్ధిచెప్పాలంటూ.కాంగ్రెస్ను దుయ్యబట్టారు.
హంస మాటలు చెప్పి కోతి చేష్టలు చేస్తారు… ఓటర్లూ జాగ్రత్తగా ఉండాంటూ అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.మొత్తానికి బాలయ్య ప్రచారం అదిరందనే టాక్ వస్తోంది.
చాలా డిఫరెంట్గా ఎక్కడా ఎవరినీ నేరుగా ఎలాంటి విమర్శ చేయకుండా చాలా హుందాగా బాలయ్య ప్రచారం సాగుతోంది.