‘లెంజెండ్’ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘లయన్’.ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని దర్శకుడు సత్యదేవ్ షూటింగ్ ప్రారంభం సమయంలో చెప్పాడు.
అయితే అనుకున్న సమయానికి షూటింగ్ను పూర్తి చేయలేక పోవడంతో ‘లయన్’ సినిమా విడుదలలో ఆలస్యం అవుతోంది.ఇటీవలే ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
అయితే తాజాగా ఏప్రిల్లో కూడా ఈ సినిమా విడుదల అవ్వడం కష్టం అని అంటున్నారు.మేడే సందర్బంగా ఈ సినిమాను మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత రుద్రపాటి రమణారావు ప్రకటించాడు.
బాలకృష్ణ సరసన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.అర్చన ఈ సినిమాలో తన హాట్ అందాలతో ఐటెం సాంగ్ను చేసింది.
సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.సీబీఐ ఆఫీసర్గా బాలయ్య ఈ సినిమాతో నందమూరి ఫ్యాన్స్కు కనువిందు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణను పోలీ ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఉంటుందని, అవినీతిపై కొరడా రaులిపించే ఆఫీసర్గా బాలయ్య కనిపిస్తాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమా ఆడియోను ఏప్రిల్ 9న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.