పశ్చిమలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది.మంత్రి పీతల సుజాత, విప్ చింతమనేని ప్రభాకర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
ప్రభాకర్ ప్రారంభించిన థియేటర్ను అధికారులు సీజ్ చేయడం.రాజకీయంగా దుమారం రేపుతోంది.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం శాతకర్ణి ప్రదర్శితమవుతున్న థియేటర్ను సీజ్ చేయడంతో మరోపక్క పీతల సుజాతపై యువరత్న అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మంత్రి ప్రాతినిథ్యం వహిస్తోన్నచింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఉన్న పాత థియేటర్ను రీ మోడలింగ్ చేశారు.
దీనిని ప్రారంభించేందుకు విప్ చింతమనేని ప్రభాకర్ను ఆహ్వానించారు.అయితే ప్రొటోకాల్ ప్రకారం.
మంత్రిని పిలవాల్సి ఉన్నా నిర్వాహకులు మాత్రం ఆ విషయాన్ని విస్మరించారు.దీంతో వివాదం మొదలైంది.
షెడ్యూల్ ప్రకారం చింతమనేని ఆ థియేటర్ను మంగళవారం ప్రారంభించారు.
ఈ థియేటర్లో బుధవారం ఖైదీ నెంబర్ 150 సినిమాను ప్రదర్శించారు.
గురువారం బాలయ్య శాతకర్ణి ప్రీమియర్ షో సైతం వేశారు.శాతకర్ణి సినిమా ఆట జరుగుతుండగానే అధికారులు సోదాలు నిర్వహించారు.
థియేటర్కు కొన్ని అనుమతులు లేవని సీజ్ చేసేశారు.అయితే మంత్రి పీతల సుజాత కావాలనే థియేటర్ను సీజ్ చేయించారని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ప్రభాకర్కు-సుజాతకు రాజకీయంగా విబేధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! మంత్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో చాలా థియేటర్లకు అన్ని లైసెన్సులు లేవని, నూరు శాతం నిబంధనలు పాటిస్తోన్న థియేటర్లను వేళ్లమీద లెక్క పెట్టవచ్చని విమర్శిస్తున్నారు.ఆమె నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తల విషయంలో ఇలాగే ముందుకు వెళితే ఆమెకు తగిన బుద్ధి చెపుతామని మండి పడుతున్నారు.