హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందిన బాలకృష్ణ మరల పోటీ చేసే అవకాశం లేదా అంటే.పరిస్థితులు చూస్తుంటే నిజమనే అనిపిస్తుంది.
హిందూపురం నియాజకవర్గ నేతలు రానున్న ఎలక్షన్స్ లో బాలయ్య కి సహకరించే విధంగా లేరు.ఎమ్మెల్యే పదవి లో ఉన్న వ్యక్తి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ నియాజకవర్గ అభివృద్ధి కి నిత్యం పాటుపడాలి.
కానీ బాలకృష్ణ ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు.దానికి గాను స్థానికంగా ఆయనపై వ్యతిరేఖ ధోరణి ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితులో ఎమ్మెల్యేగా గెలవడం కష్టమే.
ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న బాలయ్య ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లాడు.
ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ చూపు ఎంపీ పదవి పై పడింది.మరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి .అందులోను చాలా రిస్క్ ఉంది కాబట్టి బాలయ్య రాజ్యసభకు నామినేట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.చూద్దాం బావ చంద్రబాబు బావమరిది ఆలోచనలకు ఎంత వరకు సహకరిస్తాడో…!!
.