గత ఏడాది ‘బాహుబలి’ట్రైలర్ విడుదలై కేవలం 24 గంటల్లో 14 లక్షల వ్యూస్ ను సాధించి సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.ఆ తర్వాత నుంచి ‘బాహుబలి’ రికార్డ్ ను మరే చిత్రమైనా క్రాస్ చేస్తోందా అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ ‘బాహుబలి’ రికార్డ్ ను బీట్ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ అంచనా వేశారు.అయితే, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల నిన్న సాయంత్రం వరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ ను యూట్యూబ్లో ఈరోస్ సంస్థ లోడ్ చేయలేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా సంగతి అట్లా ఉంచితే.విజయ్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన ‘తెరి’ చిత్రం ట్రైలర్ ఆదివారం విడుదలై ‘బాహుబలి’ రికార్డ్ ను అధిగమించింది
అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 21 గంటల్లోనే 14 లక్షల వ్యూస్ ను సాధించి ‘బాహుబలి’ రికార్డ్ ను అధిగమించింది.
మొత్తంగా, చూసుకుంటే దాదాపు ఏడాది తర్వాత ‘బాహుబలి’ రికార్డ్ ను విజయ్ ‘తెరి’ చిత్రం బీట్ చేసినట్లయ్యింది.సమంతా, ఎమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కూతురిగా మీనా కూతురు నైనిక నటించింది.
తండ్రీ కూతుళ్లుగా విజయ్, నైనికల నటన ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నారు.మరో వైపు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఈ చిత్రం ద్వారా 50 చిత్రాల మైలురాయిని అందుకున్నాడు.