ప్రముఖ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల పాలిటిక్స్లోకి రానుందా ? జ్వాల టీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇస్తుందా ? ఆమె ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయనుందా ? అంటే ఇదే అంశంపై టీ పాలిటిక్స్లో జోరుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.ఇటీవల బ్యాడ్మింటన్ ఆటలో బాగా వెనకపడిన జ్వాల…బ్యాడ్మింటన్ ఆటలో రాజకీయాలపై బాగా విసిగిపోయానని కూడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె బ్యాడ్మింటన్కు గుడ్ బై చెప్పేసి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్లు వేసుకుంటోందట.పాలిటిక్స్లో చేరే విషయంలో ఆమె చాలా ఇంట్రస్ట్తో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఉత్సుకతతో ఉన్నట్టు సమాచారం.సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితతో ఆమె చాలా క్లోజ్గా ఉంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
అన్నీ కుదిరితే ఆమె ఎంపీగా పోటీచేసే అవకాశముందని టాక్.ఇప్పటికే ఆదిశగా ఆమె ఓ నియోజకవర్గాన్ని కూడా లైన్లో పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనుందని వార్తలు వస్తున్నాయి.
అలాగే మల్కాజ్గిరి నుంచి కూడా ఆమె ఆసక్తి కనపరుస్తున్నట్టు సమాచారం.
సికింద్రాబాద్లో అయితే అధికార టీఆర్ఎస్కు సరైన ఎంపీ అభ్యర్థి లేరు.అక్కడ నుంచి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఉన్నారు.
మరి బ్మాడ్మింటన్ స్టార్, గ్లామర్ ఇమేజ్ ఉన్న గుత్తాకు కేసీఆర్ సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్టు ఇస్తారా ? ఇస్తే ఆమె ఇక్కడ దత్తాత్రేయను ఎంత వరకు ఢీ కొడుతుందో చూడాలి.