టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్లో భారీ మార్కెట్ ఉన్న విషయం తెల్సిందే.స్టార్ హీరోలు నటించిన భారీ చిత్రాలు ఓవర్సీస్లో భారీ వసూళ్లను రాబడుతున్నాయి.
దాంతో తెలుగు సినిమాల ఓవర్సీస్ పంపిణీ హక్కుల కోసం పంపిణీదారుల తెగ ఆరాటపడుతుంటారు.ముఖ్యంగా మహేష్బాబు నటించిన సినిమాను ఎంత మొత్తానికి అయినా తీసుకునేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు సిద్దంగా ఉంటారు.
అయితే ‘బాహుబలి’ సినిమా ఓవర్సీస్లో మొత్తం టాలీవుడ్ లెక్కలను మార్చేసింది.‘బాహుబలి’ మొదటి పార్ట్ ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో వసూళ్లు చేసిన విషయం తెల్సిందే.
దాంతో రెండవ పార్ట్కు ‘బాహుబలి’ టీం ఏకంగా ఓవర్సీస్ రైట్స్ రూపంలో 75 కోట్లు రాబట్టాలని చూస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వార్తలు సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా 30 కోట్లకు మించి ఓవర్సీస్లో అమ్ముడు పోలేదు.కాని ‘బాహుబలి’ ఏకంగా 75 కోట్లు అంటే మామూలు విషయం కాదు.భారీ స్థాయిలో అంచనాలున్నా కూడా ఇంత మొత్తాన్ని అక్కడ రాబట్టడం కష్టం అని అంటున్నారు.75 కోట్లకు కొనుగోలు చేయక పోయినా 50 కోట్ల వరకు ‘బాహుబలి’ని కొనడం శ్రేయస్కరం అని విశ్లేషకులు అంటున్నారు.తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో కూడా ఓవర్సీస్లో విడుదల చేస్తే మరింత మంచి కలెక్షన్స్ వస్తాయని ఈసారి చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ‘బాహుబలి’ రెండవ పార్ట్ను వచ్చే సంవత్సరం చివర్లో విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.