టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.గత సంవత్సరంలో విడుదలైన ‘బాహుబలి’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా విజయాన్ని తల దన్నేలా ఉండాలనే ఉద్దేశ్యంతో రెండవ పార్ట్కు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.రెండవ పార్ట్కు ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయినా కూడా విడుదలకు ఇంకా సంవత్సరంకు పైగా సమయం పడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు స్వయంగా చెబుతున్నారు.
గత సంవత్సరం జులైలో విడుదలైన ‘బాహుబలి’ చిత్రం రెండవ పార్ట్ వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఇదే సంవత్సరం జూన్ లేదా జులైలో విడుదల చేయాల్సి ఉంది.
కాని షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరిపేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కువ సమయాన్ని నిర్ణయించుకున్నారు.దాంతో బాహుబలి రెండవ పార్ట్ను చూడాలంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే ఇంకా సంవత్సరంకు పైగా ఎదురు చూడాల్సిందే అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.