గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమాను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య అంటే పైరసీ.ఈ పైరసీ వల్ల సంవత్సరంలో వంద కోట్ల నష్టాను నిర్మాతలు భరించాల్సి వస్తుంది.
సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ అవుతుండటంతో నిర్మాతు బెంబేలు ఎత్తుతున్నారు.చిన్న పెద్ద అనే తేడా లేకుండా పైరసీ జరుగుతుంది.
పెద్ద సినిమాను ఇంకా ఫాస్ట్గా పైరసీ చేసేందుకు పైరసీదాయి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాను చూస్తుంటే తెలుస్తోంది.
పైరసీ నుండి ‘బాహుబలి’ని కాపాడే ప్రయత్నంను చిత్ర యూనిట్ సభ్యులు మొదలు పెట్టారు.
ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డ చిత్ర యూనిట్ తమ కష్టాన్ని పైరసీ చేసి, బూడిదలో పోసిన పన్నీరులా చేయవద్దని కోరుకుంటున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు అల్లు అరవింద్, దానయ్య, నల్లమల్లపు బుజ్జి ఇంకా పలువురు నిర్మాతతో కలిసి ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్రెస్మీట్లో తెలుగ్గు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు పైరసీ నిర్మూలనకు చేపడుతున్న చర్యను వివరించారు.ఇలాంటి సినిమా తెలుగు నుండి రావడం తెలుగు వారు అంతా ఆనందించాల్సిన విషయం అని అల్లు అరవింద్ అన్నాడు.
ఇక ఈ సినిమాను వెండి తెరపై చూస్తేనే బాగుంటుంది అని జక్కన్న చెప్పుకొచ్చాడు.‘బాహుబలి’ సినిమా జులై 10న ప్రేక్షకు ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.