ప్రభాస్ ద్విపాత్రాభినయంలో అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ కోసం, ఆడియో కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.తాజాగా రాజమౌళి ఆడియో విడుదల మరియు ట్రైలర్ విడుదల గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు.
చాలా రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.వారు మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి.
సినిమా పూర్తి కావచ్చింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నాము.
అందువల్ల ఇప్పుడే ఆడియో విడుదల మరియు ట్రైలర్పై దృష్టి పెట్టలేక పోతున్నామని చెప్పుకొచ్చాడు.త్వరలోనే ఆడియో విడుదల గురించి ఒక క్లారిటీ ఇస్తామని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేసేందుకు జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.శరవేగంగా నిర్మాణానంత కార్యక్రమాలను జరుపుతున్నారు.
ఏప్రిల్ 17న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.