టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో దాదాపుగా రెండు సంవత్సరాలుగా నటిస్తూనే ఉన్న ప్రభాస్ ఎట్టకేలకు మరో సినిమాకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది.ప్రభాస్ చివరి చిత్రం ‘మిర్చి’ నిర్మాతలు వంశీ, ప్రమోద్లు మరోసారి యంగ్ రెబల్స్టార్తో సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శర్వానంద్ హీరోగా ‘రన్ రాజా రన్’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్పై నిర్మించిన వంశీ, ప్రమోద్లు మళ్లీ ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడితో ప్రభాస్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవలే ‘బాహుబలి’ మొదటి పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యింది.
రెండవ పార్ట్కు కనీసం ఆరు నెలలు సమయం పట్టే అవకాశముంది.దాంతో ప్రభాస్ ఆ గ్యాప్లో ‘రన్ రాజా రన్’ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని నిర్మాతలు చెబుతున్నారు.పలు షార్ట్ ఫిల్మ్లు తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ ‘రన్ రాజా రన్’ చిత్రంతో వెండి తెరపై కూడా మెప్పించాడు.
దాంతో ప్రభాస్ ఈ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు.ఈ సినిమా మేలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా నిర్మాతలు వంశీ, ప్రమోద్లు ప్రకటించారు.