‘బాహుబలి’ ఆశించిన స్థాయికి రెట్టింపు కలెక్షన్స్ను నిర్మాతలకు తెచ్చి పెట్టింది.ప్రపంచ వ్యాప్తంగా గత నెల 10న విడుదలైన ఈ సినిమా ఏకంగా 500 కోట్లు రాబట్టినట్లుగా సినీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.
అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ పోతుంది.తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ కలెక్షన్స్ను రాబట్టింది.
ఒక సౌత్ సినిమా హిందీలో ఇప్పటి వరకు 100 కోట్లను రాబట్టింది లేదు.తాజాగా ఈ సినిమా ఆ లోటును తీర్చింది.
తాజాగా ‘బాహుబలి’ బాలీవుడ్లో 100 కోట్ల జాబితాలో చేరిపోయింది.
ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా ఏకంగా 100 కోట్ల షేర్ను దక్కించుకుని దుమ్ము రేపింది.
తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ దక్కించుకోవడం అంటే చాలా చాలా పెద్ద గొప్ప విషయం.కాని ‘బాహుబలి’ ఏకంగా 100 కోట్లు షేర్ను దక్కించుకుంది అంటే ఈ రికార్డును ఇప్పట్లో ఏ సినిమా కూడా సాధించలేదని తప్పకుండా చెప్పవచ్చు.
కేవం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు సాధించవచ్చని ఇప్పటి వరకు ఫిల్మ్ మేకర్స్ కూడా ఊహించి ఉండరు.ప్రభాస్ హీరోగా, రానా విలన్గా, అనుష్క, తమన్నాలు హీరోయిన్లుగా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్లు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.