టాలీవుడ్లో తెరకెక్కి బాలీవుడ్ స్థాయిని మించిన చిత్రం ‘బాహుబలి’.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని, దాదాపు 600 కోట్ల వసూళ్లను రాబట్టింది.
అంతటి విజయాన్ని సాధించిన ‘బాహుబలి’ చిత్రానికి ప్రస్తుతం రెండవ పార్ట్ తెరకెక్కుతోంది.బాహుబలి రెండవ పార్ట్ చిత్రీకరణకు చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా నటీ నటుల పారితోషికం విషయంలో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడంతో చిత్రంలో నటించిన పలువురు నటీ నటులు తమ పారితోషికాన్ని పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
మొదటగా రమ్యకృష్ణ తన పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేసిందట.దాంతో ఆమె కోరినంతగా పారితోషికాన్ని పెంచారు.
ఆమెకు పెంచిన తర్వాత మరి కొందరు ఇలాంటి డిమాండ్ చేస్తున్నారు.దాంతో ఇప్పుడు నిర్మాతలు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పలువురు తమకు పారితోషికం పెంచితేనే షూటింగ్కు హాజరు అవుతాం అని నిర్మాతలకు అల్టిమేటం జారీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.ఆ సినిమాలో అవకాశం రాని వారు ఫ్రీగా అయినా నటిస్తామని అంటున్నారు.
కాని మొదటి పార్ట్లో నటించిన వారు మాత్రం పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.