ఏ ముహూర్తాన జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను మొదలు పెట్టాడో కాని, అప్పటి నుండి కూడా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తూనే ఉంది.ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్లో ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేసిన ‘బాహుబలి’ విడుదల తర్వాత మరిన్ని రికార్డులను గంగలో కలపడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.ఇటీవల ఆడియో రైట్స్ను అత్యధిక మొత్తానికి అమ్మడం ద్వారా సౌత్ ఇండియా రికార్డును సొంతం చేసుకున్న ‘బాహుబలి’ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఆడియోను ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఆడియో కార్యక్రమాన్ని హైదరాబాద్లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్లో నిర్వహించేందుకు సెట్టింగ్ వేస్తున్నారు.
ఇక ఈ ఆడియో వేడుకను లైవ్ కవరేజ్ ఇచ్చేందుకు పలు ఎంటర్టైన్మెంట్ సంస్థలు మరియు న్యూస్ చానెల్స్ ఆసక్తి చూపుతున్నాయి.ఇప్పటి వరకు పలు సినిమాలు ఆడియో లైవ్ కవరేజ్కు 50 లక్షలు అంతకు మించి వసూళ్లు చేసింది లేదు.కాని ఈ సినిమా మాత్రం ఏకంగా కోటిన్నర రూపాయలకు లైవ్ కవరేజ్ అమ్ముడు పోయింది.టీవీ5 ఈ సినిమా లైవ్ కవరేజ్ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ మొత్తం చూస్తేనే అర్థం అవుతోంది ‘బాహుబలి’ క్రేజ్ ఏమేరకు ఉంది అనేది.