ఏపీలో 2019 ఎన్నికలు అప్పుడే రసవత్తరంగా మారాయి.ఎన్నికలకు మరో రెండేళ్లు టైం ఉండగాను రాజకీయం ఇక్కడ హీటెక్కింది.
వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికళకు వెళతాయన్నది కూడా ఇక్కడ ఆసక్తికరంగానే ఉంది.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన తెలిపారు.ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని, కావాలంటే పేపర్ మీద రాసుకోవాలంటూ మరీ ఆయన చెప్పడం వివేషం.
మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకున్నాయి.
వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఏపీ, తెలంగాణలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేశాయి.
జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది.ఇక ఇప్పుడు తాను 2019లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో ఏపీలో 2019లో టీడీపీ+బీజేపీ కూటమితో పాటు వైసీపీ, జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్ తప్పదని అందరూ అనుకున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న ధీమాగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ కొత్త కూటమిపై రాజకీయంగా కొత్త చర్చలు స్టార్ట్ అయ్యాయి.
కాగా 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ ఇప్పటికే ప్రకటించారు.
అంతేకాకుండా జనసేన ఇప్పుడు ఎన్డీయే భాగస్వామి పక్షం కాదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే తాము పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన ప్రకటించారు.మరోవైపు పవన్ కామ్రేడట్లతో కూడా కలిసి ముందుకు వెళతాడని మరో టాక్ ఉంది.
ఈ నేపథ్యంలో పవన్ 2014లో నడిచినట్టు టీడీపీ+బీజేపీ కూటమితోనే కలిసి ముందుకు వెళతాడా ? లేదా ? కామ్రేడ్లతో కలిసి ముందుకు వెళతాడా ? అన్నది చూడాలి.
ఇక అయ్యన్న వ్యాఖ్యలపై జనసేనతో పాటు విపక్ష వైసీపీలోను చర్చలు జరుగుతున్నాయి.
ఆ మూడు పార్టీలు ఒక్కటైతే రాజకీయంగా తమకు వచ్చే లాభ, నష్టాలను వైసీపీ బేరీజు వేసుకుంటోంది.ఈ వ్యాఖ్యలపై జనసేన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
.