చందమామ కథలు.గుంటూర్ టాకీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ వేసుకున్న ప్రవీణ్ సత్తారు మరో క్రేజీ సినిమాకు ముహుర్తం పెట్టనున్నారు.
మొదటి సినిమాతో జాతీయ అవార్డ్ కైవసం చేసుకున్న ప్రవీణ్ సత్తారు రెండో ప్రయత్నంగా చేసిన టాకీస్ తో తాను కమర్షియల్ సక్సెస్ కూడా కొట్టగలడు అని నిరూపించాడు.ఇక ఇప్పుడు తనలోని దర్శకత్వ ప్రతిభను మరింత పదును పెట్టి ఓ సీరియస్ పోలీస్ సినిమా చేయబోతున్నాడట.
ఇంతకీ ఈ సినిమాలో హీరోగా చేస్తుంది ఎవరో తెలుసా.డాక్టర్ రాజశేఖర్.
అంకుశం సినిమాతో పోలీస్ పాత్రకే ఓ వన్నె తెచ్చిన రాజశేఖర్ ఆ సినిమా ద్వారా ఎన్నో వందలకొద్ది పోలీస్ సినిమాలు వచ్చేలా చేశారు.అయితే ప్రవీణ్ సత్తారు రాజశేఖర్ కు సరిపడే సరైన సబ్జెట్ రెడీ చేశారట.
ఇప్పటికే హీరోతో చర్చలు కూడా జరిగాపడట.మరి చూస్తుంటే మరో అంకుశం చేసేందుకు రెడీ అయినట్టు అనిపిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్ లో హీరోగా అంత ప్రభావితం చూపించని రాజశేఖర్ విలన్ గా కూడా మారేందుకు సిద్ధమయ్యాడు మరి ఇలాంటి టైంలో ప్రవీణ్ సత్తారు సక్సెస్ కొట్టగలుగుతాడా లేదా అన్నది హాట్ టాపిక్.మరి రాబోయే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
.