తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “అష్టా చమ్మా” చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే ఉంటుంది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నేచురల్ స్టార్ నాని మరియు కలర్స్ స్వాతి నటించారు.
అలాగే ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ, స్వర్గీయ నటి భార్గవి, దర్శకుడు మరియు నటుడు శ్రీనివాస్ అవసరాల, హేమ, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించిన నటి భార్గవి తన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో నటించడానికంటే భార్గవి ముందుగా పలు చిత్రాలలో నటించింది.కానీ ఆ చిత్రాలలో ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.
అయితే వరుస సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో భార్గవి తన వైవాహిక జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా అతి చిన్న వయసులోనే మృత్యువాత పడింది.ఇంతకీ నిర్ణయం ఏమిటంటే అప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నఓ నటుడిని భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఈ పెళ్లి భార్గవి కుటుంభ సభ్యులకి అస్సలు ఇష్టం లేదు.
దీంతో భార్గవి ఇటు తన కుటుంబ సభ్యులకు కూడా దూరమైంది.
కనీసం పెళ్లయిన తర్వాత భర్త అయినా తనకు అండగా నిలబడతాడని అనుకుంటే చివరికి అతడే కాలయముడిగా మారి భార్గవి ని తన సొంత నివాసంలో హత మార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న భార్గవి జీవితం అర్థంతరంగా ముగిసి పోయింది.
అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు నటి భార్గవి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్నప్పటికీ ఆమె హత్యకి సంబంధించిన నిజానిజాలు ఇప్పటికీ బయట పెట్టలేదు.దీంతో భార్గవి హత్య జరిగిన రోజు అసలేం జరిగిందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నటి భార్గవి అన్నవరం, దేవదాసు, హాలిడేస్, రక్ష, అష్టా చమ్మా తదితర చిత్రాలలో నటించనుంది. కానీ ఇందులో అష్టా-చమ్మా చిత్రం భార్గవి కెరియర్లో మైలురాయిగా నిలవడమే కాకుండా పలు సినీ అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.
అయితే నటి భార్గవి వెండితెరలో మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇందులో భాగంగా అమ్మమ్మ డాట్ కామ్, అమృతం తదితర ధారావాహికలలో నటించింది.