మీకు 5 కోట్లు ఇస్తే ఏం చేస్తారు ? ఇప్పటికిప్పుడు ఆలోచించుకోవడం కుడా కష్టం.అసలు అయిదు కోట్లు ఎందుకు, మనకు ఓ రెండు కోట్లు ఇచ్చినా జీవితాంతం దర్జాగా బ్రతకగలం.
మరి అయిదు కోట్లు ఇస్తానన్న వద్దన్నాడు ఒక నటుడు.ఎవరా మహానుభావుడు అనుకుంటున్నారా ! తమిళ నటుడు అరవింద్ స్వామీ.
తమిళ చిత్రం తని ఒరువన్ తెలుసుగా.భారి బ్లాక్బస్టర్ గా నిలిచిన ఈ చిత్రంలో హీరో జయం రవి పాత్ర కన్నా, విలన్ గా చేసిన అరవింద్ స్వామీ పాత్రే ఎక్కువ మార్కులు కొట్టేసింది.
క్రూరమైన విలన్ గా అరవింద్ స్వామీ అదరగొట్టాడు.సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు హీరోని మరచిపోయి అరవింద్ గురించే మాట్లాడుకున్నారు.
అంతలా ఆ పాత్ర కి రక్తి కట్టించాడు అరవింద్.
ఇక తెలుగులో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి విలన్ గా చాలా మందిని అనుకున్నారు.కాని అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళి అరవింద్ స్వామీ దగ్గరికే వెళ్ళారు.
మరి అరవింద్ స్వామీ ఏమన్నాడు ? చేయనన్నాడు.
అవును చేసిన పాత్రే మళ్ళి చేస్తే బోర్ కొడుతుంది నేను చేయను అన్నాడట అరవింద్.5 కోట్లు ఇస్తాము చేయండి మహాప్రభు అని బ్రతిమాలినా , చేయనుగాక చేయను అని తేల్చి చెప్పేసాడు అరవింద్.ఇది నమ్మబుద్ధి కాకపోయినా నమ్మలేని నిజం.