మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ బ్లాక్బస్టర్ తని ఒరువన్ ని రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.తమిళ చిత్రంలో హీరోగా జయం రవి నటించగా, విలన్ పాత్రలో అలనాటి హీరో అరవింద్ స్వామి కనిపించారు.
హీరో పాత్ర కన్నా విలన్ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి తమిళ్ లో.అంతలా ఆకట్టుకున్న విలన్ పాత్ర కోసం తెలుగులో చాలా మందిని అనుకున్నారు.
నాగార్జున అని అప్పట్లో వార్తలు, ఆ తరువాత జగపతి బాబు అన్నారు.మొన్నామధ్య అరవింద్ స్వామినే అడిగితే చేసిన పాత్రనే మళ్లి చేయనన్నాడని, అయిదు కోట్లు ఇస్తామన్న ఒప్పుకోలేదని రూమర్లు వినిపించాయి.
ఇవన్ని గాలి కబుర్లే అంట.
తాజా సమాచారం ఏమిటంటే, తెలుగులో కూడా అరవింద్ స్వామే విలన్ గా కనిపించనున్నారు.దీనికోసం ఆయన తీసుకునే పారితోషికం అక్షరాల మూడు కోట్లు.ఒక విలన్ కి ఇంత పారితోషికం దక్కడం దక్షిణాదిలో ఇదే మొదటిసారి.
జనవరి 16 న మొదలు కానున్న ఈ చిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకుడు.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారు.
హీరోయిన్ ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేదు.