రామ్ చరణ్ కోసం విలన్ ఖరారు అయిపోయాడు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ బ్లాక్బస్టర్ తని ఒరువన్ ని రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.తమిళ చిత్రంలో హీరోగా జయం రవి నటించగా, విలన్ పాత్రలో అలనాటి హీరో అరవింద్ స్వామి కనిపించారు.

 Aravind Swamy Confirmed As Villain For Ram Charan-TeluguStop.com

హీరో పాత్ర కన్నా విలన్ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి తమిళ్ లో.అంతలా ఆకట్టుకున్న విలన్ పాత్ర కోసం తెలుగులో చాలా మందిని అనుకున్నారు.

నాగార్జున అని అప్పట్లో వార్తలు, ఆ తరువాత జగపతి బాబు అన్నారు.మొన్నామధ్య అరవింద్ స్వామినే అడిగితే చేసిన పాత్రనే మళ్లి చేయనన్నాడని, అయిదు కోట్లు ఇస్తామన్న ఒప్పుకోలేదని రూమర్లు వినిపించాయి.

ఇవన్ని గాలి కబుర్లే అంట.

తాజా సమాచారం ఏమిటంటే, తెలుగులో కూడా అరవింద్ స్వామే విలన్ గా కనిపించనున్నారు.దీనికోసం ఆయన తీసుకునే పారితోషికం అక్షరాల మూడు కోట్లు.ఒక విలన్ కి ఇంత పారితోషికం దక్కడం దక్షిణాదిలో ఇదే మొదటిసారి.

జనవరి 16 న మొదలు కానున్న ఈ చిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకుడు.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారు.

హీరోయిన్ ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube