ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతి పేరును ఖరారు చేసినట్లు ఎపి సీఎం చంద్రబాబు తెలిపారు.కొన్ని పేర్లను పరిశీలనలో ఉన్న అందులో చారిత్రాత్మకమైన పేరుగా అమరావతినే అంతా ఏకగ్రీవంగా ఖరారు చేసారు .
ఇలా అమరావతి పేరును ఆమోదించడం లో అంతా ముందుకు రావడం పై సంతోషంగా ఉందని చంద్రబాబు తెలిపారు .
ఎపి రాజధానికి అమరావతి పేరును కేబినెట్ ఖరారు చేసింది.ఈమేరకు ఆ వివరాలను చంద్రబాబు మీడియా సమావేశంలో వివరించారు.వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు.అత్యంత ఆధునాతన రాజధానిగా తయారు చేస్తామని రెట్టింపు ఉత్సాహంతో తెలిపారు.
వాస్తవానికి కేంద్ర నిధులు ఈయడంలో పూర్తిగా వెనకేట్టేసింది .అయినా బాబు ప్రపంచంలో నెంబర్ వన్ గా తీర్చి దిద్దాలను కోవడం ఆ పార్టీలో వారే అయోమయంగా భావిస్తున్నారు .ఏదైనా బాబు మొండిగానే ముందుకు పోతున్నారు.ఏ విధంగా సాధిస్తారో , ఏ విధంగా ఒంటరిగా చేసి చూపుతారో వేచి చూడాలి అని అంతా అనుకుంటున్నారు
.