రెండేళ్ల ప్రగతిపై బాబు రడీ...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలోని పాల‌నా పరిస్ధితుల‌ను, సమస్యపై జరిగిన పరిష్కారాల‌పై , సంక్షేమ పథకాల‌ ఫలితాల‌పై సమీక్షించేందుకు ముఖ్య్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.

 Ap Cm Ready To Review Meet With Collectors-TeluguStop.com

ఈమేరకు బుధవారం విజయవాడలో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన పరిష్కారం కాని ఫైళ్ల వివరాలు, అందుకు కారణాల‌తో సహా హాజరుకావాల‌ని ఆదేశాలు జారీ చేయటంతో రాష్ట్రంలోని అన్ని శాఖ అధికారులంతా అప్రమత్తమయ్యారు.

స‌మావేశానికికావలసినంత స‌మాచారం అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి

ప్రజా సమస్యపై ప్రభుత్వం తగు విధంగా ఎప్పటి కప్పుడు స్పందిస్తున్నా, అధికారయంత్రాంగం నుంచి తగిన సహకారం అందకనే అనేక పథకాలు జనానికి చేరువ కావటంలేదని, సమస్యకు పరిష్కారం కావట్లేదంటూ మంత్రులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ సమావేశం కీల‌కం కానుంది.

మంత్రుల‌కు, ఎమ్మెల్లేకు ర్యాంకులు నిర్ధేశించిన ముఖ్యమంత్రి జిల్లా వారీ ప్రగతి ఆధారంగా కలెక్టర్లల‌కూ ఈ స‌మావేశంలో ర్యాంకు ఇస్తూ ద‌శ‌, దిశ చేసే ఆస్కారం ఉందని సమాచారం.

అలాగే రాష్ట్రంలోని దాదాపు అన్నిశాఖ‌లలో పెండింగు దస్త్రాలు రోజురోజుకీ పెరగటం, అంతర్జాల‌ వ్యవస్ధను యం్ర‌తాంగాలు తగిన విధంగా వాడుకోకపోటం పట్ల సిఎం సీరియస్‌గా ఉన్నట్లు వినిపిస్తోంది .స‌మ‌స్య‌లు అధిగ‌మించేలా .ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.

అలాగే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమా అము తీరు తెన్నులతో పాటు లోపాలను సవరించుకునేందుకు ఈ సమావేశంలో మార్గ నిర్ధేశం జరిగే అస్కారం ఉందని సమాచారం.

ఈ సమావేశాన్ని అన్ని శాఖ ఉన్నతాధికారుతో పాటు మంత్రు ఖచ్చితంగా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు వ్లెడించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube