ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టి కొంటున్నది వివరించారు.బాబు అవినీతిపై ఏకంగా ఓ పుస్తకాన్నే తయారుచేసిన జగన్ అందులో టీడీపీ ప్రభుత్వం చేసిన కుంభకోణాల తాలూకు ఆధారాలను, జీవోలను పొందుపరిచారట.
అలాగే బాబు తమ ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో కొంటున్నాడని.ఆయనకు దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి తిరిగి తమ తరపున గెలిపించుకోవాలని అన్నారు.
చంద్రబాబు పై జగన్ చేసిన ఆరోపణలు, సంర్పించిన ఆధారాలను చూసిన హోంమంత్రి బాబు పై సీబీఐ విచారణ జరిపేందుకు సానుకూలంగా స్పందించారని కూడా జగన్ తెలిపారు.దాదాపు అరగంటసేపు రాజనాథ్ తో మట్లాడిన ఆయన ఏపీ ప్రత్యేక హోదా, టీడీపీ డ్వాక్రా మహిళలకు చేసిన అన్యాయం వంటి తదిర అంశాలపై కూడా చర్చినచారు.
అంటే ఇక జగన్ బాబు పై కేసులు పెట్టించి జైల్లో వేయించే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తారన్నమాట.