"సాక్షి" సాక్షిగా చంద్రన్న చెప్పాడు!!

దేశంలో జనాబా సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అంటూ, జనాబా లెక్కల డిపార్ట్‌మెంట్ వారు తలలు బాదుకుంటుంటే.మరో పక్క రాజకీయ నాయకులు మాత్రం అందుకు విరుద్దంగా స్లోగన్స్ ఇస్తున్నారు.

 Chandrababu Follows ‘sakshi’-TeluguStop.com

అయితే విషయంలోకి వెళితే సాక్షి మహారాజ్ అనే బీజేపీ ఎంపీ ఒకరు ఈ మధ్యన జనాల నోళ్ళలో బాగా నానుతున్నారు…దానికి కారణం ఏమిటంటే ఆయన చేస్తున్న కాంట్రొవర్షియల్ స్టేట్మెంట్స్ అనే తెలుస్తుంది.ఈ మధ్య ఆయన మాట్లాడుతూ గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని తెలిపి వివాదానికీ దారి తీశాడు అంతేకాకుండా ఆ తర్వాత ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురిని కనాలంటూ మరో వివాదానికీ సైతం తెర తీశాడు.

అందులో ముఖ్యంగా ఒకరిని సాధువుల్లో కలపాలని.మరొకరిని సైన్యానికి పంపాలని.

కోరాడు.ఇదిలా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ‘సాక్షి’ ని ఫాలో అయిపోతున్నట్లు ఉన్నాడు…నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన బాబుగారు.ఆంధ్రాలో జనాభా తగ్గిపోతోందని, ఏటా 9 లక్షల మంది పుడుతుంటే.9 లక్షల మంది చనిపోతున్నారని, ఇలాగే పరిస్థితి కొనసాగితే.ముందు ముందు ఏపీలో అంతా ముసలి వాళ్లే మిగుల్తారని, అందుకే హద్దులు ఏమీ పెట్టుకోకుండా ఒకరిద్దరిని ఎక్కువ కంటే నష్టం ఏమీ లేదని బాబు చెప్పడంతో అక్కడి వారంతా ఫక్కున నవ్వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube