‘ఎందుకయ్యా గొడవలు పడతారు? ఇద్దరూ (కేసీఆర్, బాబు) సఖ్యంగా ఉండండి.రెండు రాష్ర్టాల ప్రజలు కలిసిమెలిసి జీవించండి’ అని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ హితవు చెప్పగానే ఏపీ ప్రభుత్వానికి తప్పుగా అనిపించినట్లుంది.
ఏపీతో రోజూ గొడవ పెట్టుకునేది కేసీఆర్.తాము ప్రశాంతంగానే ఉంటున్నాం కదా…అని అనుకుంటున్నారు.
దీంతో కేసీఆర్ నిర్వాకాలపై, ఆయన తమతో గొడవలు పెట్టుకుంటున్న తీరుపై రాష్ర్టపతికి ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పని లేదు కదా…! ఆయన ఎలాగూ హైదరాబాదులోనే ఉన్నారు.
ఏపీ మంత్రులూ అక్కడే ఉన్నారు.దీంతో కొందరు మంత్రులు ఒక బృందంగా ప్రణబ్ దగ్గరికి వెళ్లి ‘అయ్యా…మా తప్పు లేదు.
కేసీఆరే గొడవలు పెట్టుకుంటున్నాడు’ అని ఫిర్యాదు చేస్తారట…! ఈ విషయం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.ఓ పక్క ఆంధ్రాలో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ, పనిలో పనిగా కేసీఆర్పై, ఆయన సర్కారు నిర్వాకాలపై ఫిర్యాదు చేస్తారట…! ‘ఇద్దరూ మంచి ఉండండయ్యా’ అని చెప్పాకే ఈ ఐడియా వచ్చిందట.
ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ గురించే చెబుతారట.ఏదో ఫిర్యాదు చేయాలి కాబట్టి చేస్తున్నారుగాని, రాష్ర్టపతికి ఈ సంగతులన్నీ తెలియవా? గవర్నర్ నరసింహన్ ఆయనకు చెప్పి ఉండరా? ఇప్పటికే కేంద్రానికి, రాష్ర్టపతికి ఆల్రెడీ ఫిర్యాదులు పంపారు.మళ్లీ క్తొతగా ఏం ఫిర్యాదు చేస్తారు? పాడిందే పాడరా.అన్నట్లుగా ఉంటుంది.పాపం…పెద్దాయనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు.