స్వీటి అనుష్క మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అనుష్క ఇటీవల ‘సైజ్ జీరో’ చిత్రంతో గట్టి ఎదురు దెబ్బ తిన్న విషయం తెల్సిందే.
ఆ విషయం దృష్టిలో ఉంచుకోకుండా మరో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రానికి అనుష్క ఒప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.ఇకపై ఈమె వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు మాత్రమే చేయబోతుంది అని ఈ నిర్ణయంతో తెలుస్తోంది.
హీరోయిన్ ఓరియంట్ చిత్రాలు చేయడం వల్ల భారీ పారితోషికంతో పాటు సక్సెస్ అయితే పేరు మొత్తం హీరోయిన్కు మాత్రమే వస్తుంది.అందువల్ల స్వీటి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సూర్యతో ‘సింగం’ సీక్వెల్లో నటిస్తున్న అనుష్క త్వరలో ‘బాహుబలి’ రెండవ పార్ట్లో నటించబోతుంది.ఆ తర్వాత ఈమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘రుద్రక్ష’ అనే చిత్రంలో నటించబోతుంది.
వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో ‘రుద్రక్ష’ చిత్రం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.‘రుద్రమ దేవి’ చిత్రం సక్సెస్ తేవడంతో ఆ నమ్మకంతో ‘రుద్రక్ష’ను అనుష్క ఒప్పుకుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.
అనుష్కకు ‘సైజ్ జీరో’ చిత్రం ఫ్లాప్ను ఇచ్చినా కూడా దాని వల్ల అనుష్కకు లాభమే కలిగిందని కొందరు అంటున్నారు.