మహేష్బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’.ఈ సినిమాకు ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.
శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ఈ సినిమా ఫస్ట్లుక్ను ఉగాది కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో మరో హీరో రాహుల్ రవీంద్రన్ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.సినిమాలోని ముఖ్య పాత్రలో ఈయన కనిపించనున్నాడు.
దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు.
‘అందాల రాక్షసి’, ‘పెళ్లి పుస్తకం’ వంటి సినిమాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాహుల్కు బ్రేక్ దక్కలేదు.
దాంతో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా ఓకే చేస్తున్నాడు.మహేష్ కాంబినేషన్లో సీన్స్ ఉన్నందు వల్లే ఈ పాత్రకు తాను ఓకే చెప్పాను అంటూ రాహుల్ చెబుతున్నాడు.
ఈ సినిమాలో రాహుల్ కనిపించేంది కొద్ది సమయమే అయినా కూడా ముఖ్యమైన పాత్ర అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ పాత్ర ఆయన కెరీర్కు తప్పకుండా ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.