ప్రస్తుతం బుల్లితెర మీద మేల్ యాంకర్స్ లో తన హవా కొనసాగిస్తున్న ప్రదీప్ మాచిరాజు ఇన్నాళ్లు సినిమాల్లో కనిపించినా అవేవో చిన్న చితకా వేశాలు.అయితే ఇప్పుడు మాత్రం సోలోగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
తమిళ సినిమా ‘మందాసు పట్టి’ సినిమా రీమేక్ లో ప్రదీప్ హీరోగా చేస్తున్నాడు.ముందు ఈ సినిమాలో సుధీర్ బాబు చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మరి సుధీర్ ఎందుకు వదులుకున్నాడో తెలియదు కాని బుల్లితెర మీద ప్రదీప్ కు ఉన్న ఇమేజ్ చూసి క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు ప్రదీప్ తో ఆ సినిమా తెలుగు రీమేక్ చేస్తున్నారు.
కోలీవుడ్ లో విష్ణు విశాల్ హీరోగా చేసిన ఈ సినిమా అంతా 1980వ కాలం నాటి పరిస్థితుల్లో ఉంటుంది.
ప్రదీప్ ఆ క్యారక్టర్ ఎలా మ్యానేజ్ చేస్తాడో ఏమో కాని ఆధ్యంతం కామెడీతో కడుపుబ్బా నచ్చించే ఆ సినిమాతో ప్రదీప్ హీరో కల నెరవేరుతుంది.అత్తారింటికి దారేది, భం బోలే నాథ్ లో కనిపించిన ప్రదీప్ ఈసారి డైరెక్ట్ గా హీరోగా చేయడం తనను అభిమానించే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
.