బుల్లి తెరపై తన హొయలు చూపుతూ ఆకట్టుకుంటూ, తాను నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్న హాట్ యాంకర్ అనసూయ.ఈ అమ్మడు అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరుస్తూ ఉంది.
తాజాగా ఈమె నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించింది.ఈ చిత్రంలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటించగా మరో రెండు ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ మరియు హంసా నందినిలు కనిపించబోతున్నారు.
ఇంత మంది ముద్దుగుమ్మలు ఉన్నా కూడా అనసూయ చూపించిన అందాలే సినిమాకు హైలైట్ అంటున్నారు.ఈ విషయాన్ని స్వయంగా సెన్సార్ బోర్డు కూడా అంగీకరించింది.
తాజాగా ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.ఈ చిత్రానికి ‘యూ/ఎ’ సర్టిఫికెట్ దక్కింది.
చాలా అంచనాలున్న ఈ సినిమాకు క్లీన్ యూ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశించారు.అయితే ఈ చిత్రంలో అనసూయ చేసిన అందాల ప్రదర్శణ వల్ల యూకు ఎ తగిలించాల్సి వచ్చింది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరియు హంసా నందినిల కంటే కూడా అధికంగా అనసూయ గ్లామర్ చూపించినట్లుగా తెలుస్తోంది.బుల్లి తెరపైనే అందాల విందు చేసే అనసూయ ఇక వెండి తెరపై ఆగుతుందా.
అందుకే సోగ్గాడు చిత్రంలో కూడా హద్దు లేకుండా అందాలు ఆరబోసింది.ఈ చిత్రం తర్వాత అనసూయకు సోలో హీరోయిన్గా కూడా నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.