వేయించాడా? ఎవరో వేశారా?

రాజకీయ పార్టీల్లో ‘ఫైర్‌ బ్రాండ్‌’ అంటే నాయకురాళ్లే.రోజా, రేణుకా చౌదరి…ఇలా కొందరున్నారు.

 An Anonymous Poster In Ntr Bhavan-TeluguStop.com

కాని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాత్రం ‘ఫైర్‌ బ్రాండ్‌’ ఓ నాయకుడు.అతనే మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రేవంత్‌ రెడ్డి.

కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యే నాయకుడు టీడీపీలో ఇతనొక్కడే కనబడుతున్నాడు.కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఏమనడానికైనా వెనకాడడు.

ఇలాంటి నాయకుడికి టీడీపీలో అన్యాయం జరుగుతోందా? ప్రస్తుతం పార్టీలో కలుగుతున్న సంచలనం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది.ఏం జరిగిందంటే…రేవంత్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌టిఆర్‌ భవన్లో పోస్టర్‌ దర్శనమిచ్చింది.

ఇది పెద్ద సంచలనమైపోయింది.ఈ పోస్టర్‌ ఎవరు వేశారో తెలియదు.

రేవంత్‌ అభిమానులెవరో వేశారని తెలుస్తోంది గాని వ్యక్తులెవరో తెలియదు.రేవంత్‌ రెడ్డే వేయించి ఉంటాడని కొందరు అనుమానిస్తున్నారు.

ఈ పోస్టర్‌కు, తనకు సంబంధం లేదని ఎవరు వేయించారో తనకు తెలియదని రేవంత్‌ అన్నాడు.తనకు ఏ పదవులపైనా ఆసక్తి లేదన్నాడు.

ప్రస్తుత అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆధ్వర్యంలో పనిచేయడం తనకు సంతోషంగానే ఉందన్నాడు.

రాజకీయాలు అనేక రకాలుగా నడుపుతారు.పోస్టర్‌ వేయడం కూడా రేవంత్‌ రాజకీయంలో భాగమైనా ఆశ్చర్యం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube