‘రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండకూడదు’ అంటూ.నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీ వాసులు సామాజిక మాద్యమం ద్వారా ధోనీకి విన్నవించుకున్నారు.
నోయిడా సెక్టర్ 45లోని ‘షప్పైర్’ ప్రాజెక్టు కొత్తగా నిర్మించిన ప్లాట్లలో 800కుటుంబాలు నివసిస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు ప్లాట్లకు సంబంధించిన పూర్తి సౌకర్యాలు కల్పించడంలో ఆ సంస్థ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.
విద్యుత్, సివిల్ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.దీంతో ఆ హౌసింగ్ సొసైటీ వాసులు నిరసనకు దిగారు.
ఆన్లైన్లో ఆ సంస్థకు వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు.దీనికి ధోని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించకూడదని కూడా సామాజిక వేదిక ద్వారా విజ్ఞప్తులు చేశారు.
ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో.సదరు కంపెనీ దిగొచ్చింది.
వారి పెండింగ్లో ఉన్న ప్లాట్ల పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది.
.