ప్రజల మనిషిగా, రాజకీయ కుళ్ళును తన చీపురుతో ఊడ్చేస్తా అంటూ ప్రగల్భాలు పలికి డిల్లీ కొంగ్రెస్ ను ముప్పులు తిప్పలు పెట్టిన కేజ్రీవాల్ తాను సైతం రాజకీయానికి అతీతున్ని కాదు అని నిరూపించు కూనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.రానున్న డిల్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాజకీయ నాయకుని అవతారం ఎత్తాడు.
ఎక్కువగా ప్రజలో ఉంటేనే లాభం అనుకుని డిల్లీ పీఠం పై కన్నేసాడు.అందులో భాగంగానే తమ పార్టీ విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే విధానాన్ని అవలంబించాడు.
ప్రత్యేక మైన రోడ్ షోస్, అక్కడక్కడా సభలు, దాదాపు 250 ప్రొజెక్టర్స్ తో పార్టీ గురించి, పార్టీ విధి విధానాల గురించి షార్ట్ ఫిల్మ్స్, బాలీవుడ్ కు చెందిన మహా మహా సెలెబ్రెటీస్ తో క్యాంపేన్ చేయించడం.మాటల తూటాలతో దూకుడుగా ప్రచారాన్ని కొనసాగించడం.
ఇలా ఒక్కటి ఏమిటి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ప్రచారాన్ని కొనసాగించి డిల్లీ పీటాన్ని కైవసం చేసుకోవాలి అనేది కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తుంది.మరి నమో మంత్రం ముందు ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.!!
.