ఫేక్ ఓట్లతో గెలుద్దాం అనుకున్న అల్లు అర్జున్ ?

సైమా అవార్డుల కోలాహలం మొదలైంది.జూన్ 30, జులై 1 తేదినా సింగపూర్ వేదికగా ఈ అవార్డు ఫంక్షన్ జరుగనుంది.

 Allu Arjun’s Fake Votes Controversy In Siima Awards Poll-TeluguStop.com

అయితే ఈ అవార్డుకి సంబంధించి సైమా ఆఫీషియల్ వెబ్ సైట్ లో పోలింగ్ జరుగుతోంది.తెలుగులో ఉత్తమ నటుడి అవార్డు కోసం మహేష్ బాబు, ప్రభాస్,అల్లు అర్జున్, నాని, వరుణ్ తేజ్ పోటిపడుతున్నారు.

పోటి మొదలైనప్పుటినుంచి శ్రీమంతుడు చిత్రానికి నామినేట్ అయిన మహేష్ , బాహుబలి చిత్రానికి నామినేట్ అయిన ప్రభాస్ ల మధ్యే అసలైన పోటి జరుగుతోంది.ఓ పూట మహేష్ స్వల్ప ఆధిక్యాన్ని సాధిస్తే, మరో పూట ప్రభాస్ స్వల్ప ఆధిక్యత పొందుతున్నాడు.

కాని నిన్నరాత్రి ఒక్కసారిగా రుద్రమదేవి చిత్రానికి నామినేట్ అయిన అల్లు అర్జున్ వీరిద్దరినీ దాటేసి ముందుకొచ్చాడు.రాత్రికి రాత్రే ఇంత మార్పేంటి అని అందరు ఆశ్చర్యపోతుండగానే అవి ఫేక్ ఓట్లని తేలింది.

సైమా అల్లు అర్జున్ కి పడిన ఆ ఫేక్ ఓట్లన్ని తీసేసింది.దాంతో మళ్ళీ పోటి మహేష్, ప్రభాస్ మధ్యే నడుస్తోంది.

ఈ ఫేక్ ఓట్లు అల్లు అర్జున్ అభిమానులు చేసిన పనే అని అందరి అనుమానం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube