మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’.క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ తెలుగు ప్రేక్షకులు మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సమంత హీరోయిన్గా నిత్యామీనన్, అదా శర్మలు ఇతర ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఈ సినిమా ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మరో నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఆడియోను వచ్చే నెల 8న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని అంటున్నారు.ఇక సినిమాను కూడా వేసవిలోనే విడుదల చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు.
ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.ప్రస్తుతం స్పెయిన్లో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్ర యూనిట్ త్వరలోనే ఇండియాకు రానున్నారు.