అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రం ‘అఖిల్’తో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదల అయిన వెంటనే అఖిల్ తన రెండవ సినిమాను ‘మనం’ చిత్రంతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్తో చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే నాగార్జునకు విక్రమ్ ఒక కథను ఎంపిక చేసుకున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి.కాని ఇదే సమయంలో విక్రమ్ కూమార్ ప్రస్తుతం చేస్తున్న ‘24’ సినిమా విడుదల అయిన తర్వాత తెలుగులో బన్నీ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ గ్యాప్లో విక్రమ్ తన ‘24’ చిత్రాన్ని పూర్తి చేసి, ఆ తర్వాత బన్నీ కోసం స్క్రిప్ట్ను సిద్దం చేయనున్నాడు అంటూ మెగా సన్నిహితులు కూడా చెబుతున్నారు.
దాంతో బన్నీ, విక్రమ్ల కాంబినేషన్లో మూవీ దాదాపుగా ఖాయం అని అంటున్నారు.నితిన్తో విక్రమ్ తెరకెక్కించిన ‘ఇష్క్’ తరహాలోనే ఒక చక్కని ప్రేమ కథతో అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నాడు.
అందుకు స్టోరీ లైన్ కూడా రెడీ ఉన్నట్లుగా చెబుతున్నారు.దాంతో అఖిల్ రెండవ సినిమా ఎవరితో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.