అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్, అదాశర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సినిమా తర్వాత బన్నీ నటించబోయే సినిమా అప్పుడే ఖరారు అయ్యింది.
ఆ సినిమాకు ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా వచ్చే సంవత్సరం మేలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా ప్రారంభం అయ్యేందుకు చాలా సమయమే ఉంది.అయినా ఇప్పటికే బన్నీ ఆ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను బుక్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాల్లో అందంతో పాటు అభినంతో కూడా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లే వస్తున్నాయి.వచ్చే సంవత్సరం మే వరకు అంటే పూజా హెగ్డే వేరే సినిమాలకు కమిట్ అయ్యి, డేట్లు దొరకవేమో అనే ఉద్దేశ్యంతో బన్నీ ఇప్పుడే ఆమెను బుక్ చేయించినట్లుగా తెలుస్తోంది.
బన్నీతో నటించేందుకు పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా వచ్చే సంవత్సరం చివరల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.