అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘సరైనోడు’ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా తొలి రోజున వచ్చిన టాక్ తో ఆయన కొంచెం టెన్షన్ పడటం జరిగింది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లోను చురుకుగా పాల్గొనవలసి వచ్చింది.ఊహించని విధంగా ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి.
ఆశించిన స్థాయిలో లభించిన ఫలితం సంతృప్తిని కలిగించడంతో అల్లు అర్జున్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.మానసిక పరమైన ఉల్లాసం అవసరమని భావించిన ఆయన, ఫ్యామిలీతో కలిసి సరదాగా కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నాడట.
అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.ఓ 15 రోజుల పాటు కాశ్మీర్ లో గడిపి వచ్చిన తరువాత, తన తదుపరి సినిమా విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకోనున్నాడని అంటున్నారు.
దర్శకుడు లింగుస్వామితో రెడీ అవుతాడా? లేదంటే విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడా? అనే విషయంలో అప్పుడు క్లారిటీ వస్తుంది.